దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 16159 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2022 4:58 AM GMT
దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,54,465 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16159 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 28 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,25,270 కి చేరింది.

నిన్న 15,394 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,29,07,327కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,15,212 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.53 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.56 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 198.20కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story