దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా పాజిటివ్ కేసులు

India reports 16103 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టి పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 4:41 AM GMT
దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టి పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. కొత్త‌గా 16,103 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,02,429కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 31 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,25,199కి చేరింది.

నిన్న 13,929 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,28,65,519కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,11,711 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.54 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.27శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 197.95 కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story