భారీగా పెరిగిన క‌రోనా కేసులు

India Reports 16047 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2022 4:44 AM GMT
భారీగా పెరిగిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,25,081 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,047 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గత 24 గంటల్లో 54 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 5,26,826కి చేరింది.

నిన్న 19,539 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,35,35,610కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,28,261 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.52శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.94శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 15,21,429 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 207.03 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story