దేశంలో కొత్త‌గా 15,940కేసులు

India Reports 15940 new corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 4:49 AM GMT
దేశంలో కొత్త‌గా 15,940కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,01,649 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..15,490పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,78,234కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 20 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,974కి చేరింది.

నిన్న 12,425 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,27,61,481కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 91,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.58 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.39శాతంగా ఉంది. దేశం క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్ప‌టి ఇప్పటి వరకు 196.94 కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story