క‌రోనా కేసుల్లో కొన‌సాగుతున్న హెచ్చుత‌గ్గులు

India Reports 1574 new corona cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2022 6:12 AM GMT
క‌రోనా కేసుల్లో కొన‌సాగుతున్న హెచ్చుత‌గ్గులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న రెండు వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా.. నేడు ఆసంఖ్య 1500కు త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,65,901 నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 1,574 కేసులు వెలుగు చూసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,50,662కి చేరింది. నిన్న 9 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 5,29,008.

నిన్న 2,161 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,41,02,852కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 18,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.77 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.95 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 1,72,838 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.62 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story