దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India Reports 14830 new covid-19 Infections.దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,26,102

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 5:12 AM GMT
దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,26,102 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 14,830 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,20,451కి చేరింది. గత 24 గంటల్లో 36 మంది కరోనాతో మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,110కి చేరింది.

నిన్న 18,159మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,32,46,829 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.47శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.48 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 30,42,476మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 202.5 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story