దేశంలో గ‌ణ‌నీయంగా త‌గ్గిన క‌రోనా కేసులు

India Reports 12751 new corona infections.దేశంలో క‌రోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 4:38 AM GMT
దేశంలో గ‌ణ‌నీయంగా త‌గ్గిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,63,855 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 12,751 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గత 24 గంటల్లో 42 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 5,26,772కి చేరింది.

నిన్న 16,412 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,35,16,071 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.51శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.69 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 31,95,034 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 206.88 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story