భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

India Reports 1112 new corona cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 6:16 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న‌టి పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1112 కేసులు వెలుగు చూసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880కి చేరింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,28,987 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,892 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,40,97,072కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 20,821 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.77 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.77 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 1,22,555 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.58 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story