భారత్ కరోనా అప్డేట్.. స్వల్పంగా తగ్గిన కేసులు
India reported 40120 new corona cases today.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24
By తోట వంశీ కుమార్ Published on
13 Aug 2021 5:07 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,70,495 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 40,120 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,17,826 చేరింది. నిన్న ఒక్క రోజే 585 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,30,254 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న42,295 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,13,02,345 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,85,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.46శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.13శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 57,31,574 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 52,95,82,956 టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story