టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!

టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న‌ పోరాటంలో భారత్ భారీ విజయాన్ని సాధించింది.

By Kalasani Durgapraveen  Published on  18 Oct 2024 3:35 AM GMT
టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!

టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న‌ పోరాటంలో భారత్ భారీ విజయాన్ని సాధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మాట్లాడుతూ.. హ్యాండ్‌హెల్డ్ పోర్టబుల్ ఎక్స్-రే మెషిన్ టీబీని ముందస్తుగా గుర్తించగలదని పేర్కొన్నారు.

డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఇండియా 2024 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా.. ICMR డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే మెషీన్లు చాలా ఖరీదైనవి.. అయితే ICMR IIT కాన్పూర్ భాగస్వామ్యంతో స్వదేశీ హ్యాండ్-హెల్డ్ ఎక్స్-రే యంత్రాలను అభివృద్ధి చేసింది.. దీంతో ఇంట్లో కూడా టీబీ పరీక్ష చేయించుకోవచ్చని తెలిపారు. MPAX పరీక్ష కోసం భారత్‌ కూడా టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసిందని డాక్టర్ బహ్ల్ చెప్పారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాదిలోగా ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు.

మొహాలిలోని నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (INST)కి చెందిన శాస్త్రవేత్తలు మొదటిసారిగా TB చికిత్స కోసం ముక్కు ద్వారా మందులను పంపిణీ చేసే పద్ధతిని అభివృద్ధి చేశారు. ముక్కు ద్వారా నేరుగా మెదడుకు TB మందులను పంపిణీ చేయడం జ‌రుగుతుంది. మెదడును ప్రభావితం చేసే TBని కేంద్ర నాడీ వ్యవస్థ TB (CNS-TB) అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన టీబీ. నాసికాకు మందులు ఇచ్చే కొత్త పద్ధతి మెదడులోని టీబీ బ్యాక్టీరియాను వెయ్యి రెట్లు తగ్గించగలదు. దీని కోసం INST బృందం చిటోసాన్ అనే సహజ పదార్ధంతో తయారు చేయబడిన నానోపార్టికల్స్‌ను ఉపయోగించింది. ఇది ముక్కు ద్వారా నేరుగా మెదడుకు TB మందులను పంపిణీ చేస్తుంది.

నానోస్కేల్ (రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ) జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక‌లో.. టీబీ సోకిన ఎలుకలలో, ఈ నానో-అగ్రిగేట్‌లను ముక్కు ద్వారా పంప‌డం వల్ల మెదడులోని బ్యాక్టీరియా సంఖ్యను చికిత్స చేయని ఎలుకలతో పోలిస్తే వెయ్యి రెట్లు తగ్గించిందని బృందం తెలిపింది. కొత్త చికిత్సా పద్ధతి మెదడు టీబీతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్సను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇతర మెదడు ఇన్ఫెక్షన్లు, అల్జీమర్స్, పార్కిన్సన్స్, మెదడు కణితులు, మూర్ఛ వంటి వ్యాధుల చికిత్సకు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.


Next Story