భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

India covid-19 update on January 19th.దేశంలో విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. అయితే.. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2022 4:50 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా పెరిగిన కేసులు

దేశంలో విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. అయితే.. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,69,642 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,82,970 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. నిన్న 441 మంది మ‌ర‌ణించారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,87,202కి చేరింది.

ఒక్క రోజులో 1,88,157 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,55,83,039కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 93.88శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 15.13శాతానికి పెరిగింది. ఇక బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 8,961 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న 76,35,229 మందికి టీకా వేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 158.88 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story