భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 5 ల‌క్ష‌లు దాటిన మ‌ర‌ణాల సంఖ్య

India covid-19 update on February 4th.దేశంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 4:22 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 5 ల‌క్ష‌లు దాటిన మ‌ర‌ణాల సంఖ్య

దేశంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 16,11,666 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,49,394 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712కి చేరింది. నిన్న1,072 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,00,055కి చేరింది.

ఒక్క రోజులో 2,46,674 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,00,17,088కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,35,569యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 95.39శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 9.27 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 168.47కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story