ఊపిరి పీల్చుకుంటున్న భార‌త్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India covid-19 update on February 27th.క‌రోనా కోర‌ల్లోంచి భార‌త్ బ‌య‌ట‌ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2022 4:03 AM GMT
ఊపిరి పీల్చుకుంటున్న భార‌త్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

క‌రోనా కోర‌ల్లోంచి భార‌త్ బ‌య‌ట‌ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. నిన్న 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. నేడు ఆసంఖ్య ఇంకా త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 10,22,204 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 10,273 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. నిన్న243 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,13,724కి చేరింది.

ఒక్క రోజులో 20,439 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,22,90,921కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.54శాతానికి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.00 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న26,39,750 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,77,44,08,129 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story