శాంతిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Covid-19 update on February 26th.దేశంలో రోజువారి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతోంది. నిన్న 13,166 పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 4:20 AM GMT
శాంతిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో రోజువారి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతోంది. నిన్న 13,166 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. నేడు ఆసంఖ్య కాస్త త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 11,36,133 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,05,844కి చేరింది. నిన్న255 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,13,481కి చేరింది.

ఒక్క రోజులో 23,598 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,22,70,482కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,21,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.01 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న28,29,582 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,77,17,68,379 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story