త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. 14వేల దిగువ‌కు కొత్త కేసులు

India Covid 19 update on February 22nd.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 4:26 AM GMT
త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. 14వేల దిగువ‌కు కొత్త కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య‌ గ‌ణ‌నీయంగా త‌గ్గుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 10,84,247 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 13,405 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,51,929కి చేరింది. నిన్న235 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,12,344కి చేరింది.

ఒక్క రోజులో 34,226 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,28,51,929కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.38 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.24 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,75,83,27,441 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story