భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న మ‌ర‌ణాలు

India Covid-19 update on February 1st.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే.. మ‌ర‌ణాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 4:19 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే.. మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 14,28,672 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,67,059 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,69,499కి చేరింది. నిన్న1193 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,96,242కి చేరింది.

ఒక్క రోజులో 2,54,076 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,92,30,198కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 17,43,059యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 94.60శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 11.69శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,66,68,48,204 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story