భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India covid 19 update on February 19th.దేశంలో రోజువారి క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 5:02 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో రోజువారి క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 14 శాతం త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 12,35,471 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 22,270 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,02,505కి చేరింది. నిన్న325 మంది మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,11,230కి చేరింది.

ఒక్క రోజులో 60,298 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,20,37,536కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.21 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.80 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 36 ల‌క్ష‌ల‌ మందికి పైగా టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1.75 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story