భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎంత‌మందికి సోకిందంటే

India covid-19 update on February 18th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుతూ వ‌స్తోంది. కొద్ది రోజులుగా రోజువారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 4:35 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎంత‌మందికి సోకిందంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుతూ వ‌స్తోంది. కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 12,54,893 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 25,920 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. నిన్న 492 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,10,905కి చేరింది.

ఒక్క రోజులో 66,254 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,19,77,238కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,92,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.12 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.07 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 37.8 ల‌క్ష‌ల‌ మందికి పైగా టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,74,64,99,461 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story