భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India covid-19 update on February 17th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 11,79,705

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 5:11 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 11,79,705 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 30,757 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,54,315కి చేరింది. నిన్న 541మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,10,413కి చేరింది.

ఒక్క రోజులో 67,538 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,19,10,984కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,32,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.03 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.61 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 34.7 ల‌క్ష‌ల‌ మందికి పైగా టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 174.24 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story