భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన రోజువారి కేసుల సంఖ్య

India covid-19 update on February 16th.దేశంలో రోజువారి క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 4:38 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన రోజువారి కేసుల సంఖ్య

దేశంలో రోజువారి క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో 12,51,677 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 30,615 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,23,558కి చేరింది. నిన్న514 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,09,872కి చేరింది.

ఒక్క రోజులో 82,988 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,18,43,446కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,09,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 97.94 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.45 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 44 ల‌క్ష‌ల‌ మందికి పైగా టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 173.86 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story