శుభ‌వార్త‌.. దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

India covid-19 update on February 15th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Feb 2022 4:36 AM GMT
శుభ‌వార్త‌.. దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంటల్లో 12,29,536 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 27,409 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,26,92,943కి చేరింది. నిన్న347 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,09,358కి చేరింది.

ఒక్క రోజులో 82,817 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,17,60,458కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,09,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 97.82 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.23 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 44,68,365 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 173.42 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story