భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా 44 వేల పాజిటివ్ కేసులు

India covid-19 update on February 13th.దేశంలో రోజువారి క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2022 4:47 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా 44 వేల పాజిటివ్ కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 11 శాతం త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 14.50ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 44,877 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,26,31,421కి చేరింది. నిన్న684 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,08,665కి చేరింది.

ఒక్క రోజులో 1,17,591 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,15,85,711కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 97.55 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 3.17 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 48.81 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 172.81 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story