భ‌య‌పెడుతున్న ఒమిక్రాన్.. దేశంలో వెయ్యి దాటిన కేసులు

India Covid-19 update on December 31st.దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం నాటికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 4:59 AM GMT
భ‌య‌పెడుతున్న ఒమిక్రాన్.. దేశంలో వెయ్యి దాటిన కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1270కి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో 450, ఢిల్లీలో 320, కేర‌ళ‌లో 109, గుజ‌రాత్ 97, రాజ‌స్థాన్‌లో 69, తెలంగాణ‌లో 62, త‌మిళ‌నాడులో 46, క‌ర్ణాట‌క‌లో 34, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16, హ‌ర్యానాలో 14, ఒడిశాలో 14, ప‌శ్చిమ‌బెంగాల్‌లో 11, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 9, ఉత్త‌రాఖండ్‌లో 3, జ‌మ్ముక‌శ్మీర్‌లో 3, అండ‌మాన్ నికోబార్ దీవుల్లో 2, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2, గోవాలో 1, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 1, లద్దాఖ్‌లో 1, మ‌ణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 374 మంది కోలుకున్నారు.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 12,50,837 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 16,764 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,38,804కి చేరింది. నిన్న ఒక్క రోజే 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,81,080కి చేరింది. నిన్న 7,585 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,66,363కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 91,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న66,65,290 మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 144.54 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 67.78 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story