దేశంలో ఒమిక్రాన్ క‌ల‌వరం.. 111 కు చేరిన కేసులు

India Covid-19 update on December 18th.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2021 5:49 AM GMT
దేశంలో ఒమిక్రాన్ క‌ల‌వరం.. 111 కు చేరిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 12,45,402క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 7,145 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరింది. నిన్న ఒక్క రోజే 289 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,77,158కి చేరింది.

నిన్న8,706 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,41,71,471కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 84,565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.38 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 62ల‌క్ష‌ల‌ మందికి పైగా క‌రోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 136.66 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66.28 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

ఇక దేశంలో ఒమిక్రాన్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క‌లిపి మొత్తం 11 ప్రాంతాల్లో వ్యాపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 111 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 40కి పైగా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story