త‌గ్గుతున్న క‌రోనా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

India Covid-19 update on December 14th.భార‌త్‌లో క‌రోనా రోజువారి కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 4:58 AM GMT
త‌గ్గుతున్న క‌రోనా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

భార‌త్‌లో క‌రోనా రోజువారి కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,90,482క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 5,784 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,03,644కి చేరింది. నిన్న ఒక్క రోజే 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,75,888కి చేరింది.

నిన్న7,995 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,41,38,763కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.37 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న66.9లక్ష‌ల మందికి క‌రోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 133.8 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 65.76 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

ఇదిలా ఉంటే.. దేశంలో ఒమిక్రాన్ చాప‌కింద నీరుగా వ్యాప్తి చెందుతోంది. ప్ర‌స్తుతం దేశంలో 41 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 20 మందిలో, రాజ‌స్థాన్‌లో 9, గుజ‌రాత్‌లో 4, క‌ర్ణాట‌క 3, ఢిల్లీ 2, కేర‌ళ 1, ఏపీ 1, చండీగ‌ర్ 1 కేస‌లు నోమ‌దు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్రం హెచ్చ‌రించింది.

Next Story