భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. వ‌రుస‌గా రెండో రోజూ 20వేల‌కు దిగువ‌నే

India covid 19 bulletin on October 6th.భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా 20వేలకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2021 5:14 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. వ‌రుస‌గా రెండో రోజూ 20వేల‌కు దిగువ‌నే

భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా 20వేలకు దిగువ‌గానే కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,09,825 మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 18,833 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881 చేరింది. నిన్న ఒక్క రోజే 278 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,49,538కి చేరింది.

నిన్న 24,770 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,31,75,656 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,46,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 203 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 97.94 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 59.48 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 92 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

Next Story