భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. ఎనిమిది నెల‌ల క‌నిష్టానికి త‌గ్గిన కేసులు

India Covid-19 bulletin on October 26th.భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. ఎనిమిది నెల‌ల క‌నిష్టానికి కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2021 4:57 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. ఎనిమిది నెల‌ల క‌నిష్టానికి త‌గ్గిన కేసులు

భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. ఎనిమిది నెల‌ల క‌నిష్టానికి కేసుల సంఖ్య ప‌డిపోయాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 11,31,826 మంది క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 12,428 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,42,02,202కి చేరింది. నిన్న ఒక్క రోజే 356 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,55,068కి చేరింది. నిన్న 15,951 మంది కోలుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,35,83,318కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.19 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 64,75,733 మందికి క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు 102.94కోట్ల‌ టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story