భారత్ కరోనా అప్డేట్.. భారీగా పెరిగిన కేసులు
India covid-19 Bulletin on October 21st.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2021 5:36 AM GMT
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,47,506 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 18,545 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,27,541కి చేరింది. నిన్న ఒక్క రోజే 160 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,52,811కి చేరింది. నిన్న 17,561 మంది కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 21, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/aaLAbgN7xB pic.twitter.com/JhEgxSj4xY
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,34,95,808కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,78,831 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.15 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నేటితో 100 కోట్ల డోసులు టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.