కొత్త‌గా 14వేల కేసులు.. 302 మ‌ర‌ణాలు

India corona virus update on February 24th.దేశంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంది. దేశంలో రోజువారి కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 5:02 AM GMT
కొత్త‌గా 14వేల కేసులు.. 302 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంది. దేశంలో రోజువారి కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 11,55,147 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 14,148 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది. నిన్న302 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,12,924కి చేరింది.

ఒక్క రోజులో 30,009 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,22,19,896కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,48,359 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.22 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 30 ల‌క్ష‌ల‌ మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 176.52 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story