తీవ్ర రూపం దాల్చుతున్న క‌రోనా.. కొత్తగా ఎన్నికేసులంటే

India corona update on January 8th.దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 4:36 AM GMT
తీవ్ర రూపం దాల్చుతున్న క‌రోనా.. కొత్తగా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 21 శాతం పెరిగింది. నిన్న దేశవ్యాప్తంగా 15,29,948 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,41,986 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,68,312 కి చేరింది. నిన్న ఒక్క రోజే 285 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,83,463కి చేరింది.

నిన్న 40,895 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,44,12,740కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,72,169 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. శ‌నివారం ఉద‌యానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,071కి చేరింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 876 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.. ఆ త‌రువాత ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 123, తమిళనాడులో 121, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 28 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 1,203మంది కోలుకున్నారు. నిన్న 40 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story