క‌రోనా విజృంభ‌ణ‌.. వ‌రుస‌గా నాలుగో రోజూ 3ల‌క్ష‌ల‌పైనే కేసులు

India corona update on January 23rd.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,75,533

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2022 4:52 AM GMT
క‌రోనా విజృంభ‌ణ‌.. వ‌రుస‌గా నాలుగో రోజూ 3ల‌క్ష‌ల‌పైనే కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,75,533 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,33,533 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. నిన్న 525 మంది మ‌ర‌ణించారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,89,409కి చేరింది.

ఒక్క రోజులో 2,59,168 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 93.18శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 17.78శాతంగా న‌మోదు అయింది. నిన్న 71.10 ల‌క్ష‌ల మందికి టీకా అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,61,92,84,270 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story