భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India corona update on January 11th.దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య భారీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 5:10 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 15,79,928 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,68,063 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.58కోట్ల‌కు చేరింది. నిన్న ఒక్క రోజే 277 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 4,84,213కి చేరింది. ఒక్క రోజులో 69,959 మంది కోలుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 8,21,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. మంగ‌ళ‌వారం ఉద‌యానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 4,461కి చేరింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 1,247 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.. ఆ త‌రువాత రాజ‌స్థాన్‌లో 645, ఢిల్లీలో 546 ఉంది దీని బారిన ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,711 మంది కోలుకున్నారు. నిన్న 92,07,700 మందికి టీకా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 152.89 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story