పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. మ‌హారాష్ట్ర‌ను దాటిన ఢిల్లీ

India Corona update on December 27th.దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 4:50 AM GMT
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. మ‌హారాష్ట్ర‌ను దాటిన ఢిల్లీ

దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 156 కేసులు న‌మోదు అయ్యాయి. సోమ‌వారం ఉద‌యం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 578కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో 142, ఢిల్లీలో 141, కేర‌ళ‌లో 57, గుజ‌రాత్‌లో 49, రాజ‌స్థాన్‌లో 43, తెలంగాణ‌లో 41, త‌మిళ‌నాడులో 34, క‌ర్ణాట‌క‌లో 31, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 9, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6, ప‌శ్చిమ బెంగాల్ 6, హ‌ర్యానాలో 4, ఒడిశాలో 4, జమ్ము క‌శ్మీర్‌లో 3, చండీఘ‌ర్‌లో 3, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2, లద్దాఖ్‌లో 1, ఉత్త‌రాఖండ్‌లో 1, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 1, చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 151 మంది కోలుకున్నారు.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 7,52,935 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 6,531 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,93,333కి చేరింది. నిన్న ఒక్క రోజే 315 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,79,997కి చేరింది. నిన్న 7,141 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,37,495కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 75,841 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న29.9 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 141.70 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 67.29 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story