దేశంలో ఏడువేల‌కు పైగా క‌రోనా కేసులు.. 415కు పెరిగిన ఒమిక్రాన్

India Corona update on December 25th.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో త‌న పంజా విసురుతోంది. రోజువారి కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 4:57 AM GMT
దేశంలో ఏడువేల‌కు పైగా క‌రోనా కేసులు.. 415కు పెరిగిన ఒమిక్రాన్

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో త‌న పంజా విసురుతోంది. రోజువారి కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. శ‌నివారం ఉద‌యం నాటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 415కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో 108, ఢిల్లీలో 79, గుజ‌రాత్‌లో 43,తెలంగాణ‌లో 38, కేర‌ళ‌లో 37, త‌మిళ‌నాడులో 34, క‌ర్ణాట‌క‌లో 31, రాజ‌స్థాన్‌లో 22, హ‌ర్యానాలో 4, ఒడిశాలో 4, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 4, జమ్ము క‌శ్మీర్‌లో 3, ప‌శ్చిమ బెంగాల్ 3, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2, చండీఘ‌ర్‌లో 1, లద్దాఖ్‌లో 1, ఉత్త‌రాఖండ్‌లో 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 115 మంది కోలుకున్నారు.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 11,12,195 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 7,189 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,79,815కి చేరింది. నిన్న ఒక్క రోజే 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,79,520కి చేరింది. నిన్న 7,286 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,23,263కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 77,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న66 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 141.01 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 67.10 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story