భారత్ కరోనా అప్డేట్.. ఈ రోజు ఎన్నికేసులంటే..?
India corona update on December 19th.భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12,11,977 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 7,081 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,40,275కి చేరింది. నిన్న ఒక్క రోజే 264 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,77,422కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 19, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/IFpbD6GsaF pic.twitter.com/aLkGNKsqT1
నిన్న7,469 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,41,78,940కి చేరింది. ప్రస్తుతం దేశంలో 83,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.38 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 76,54,466 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,37,46,13,252 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 66.41 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇక దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 143 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 48కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత ఢిల్లీలో 22, రాజస్థాన్లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్లో 7 కేసులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగఢ్లలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.