దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
India corona update on December 17th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,59,932కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 7,974 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,26,049కి చేరింది. నిన్న ఒక్క రోజే 391 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,76,869కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
— Ministry of Health (@MoHFW_INDIA) December 17, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/Ir2luAWaJ8 pic.twitter.com/5mjmp45yky
నిన్న7,886 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,41,62,765కి చేరింది. ప్రస్తుతం దేశంలో 86,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.38 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 70లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,35,99,96,267 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 66.15 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.