ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

బియ్యం ఉత్పత్తిలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించి...

By -  అంజి
Published on : 6 Jan 2026 8:43 AM IST

India, world’s largest rice producer, Union Agriculture Minister Shivraj

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

బియ్యం ఉత్పత్తిలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించి, ఇప్పటివరకు ముందంజలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది.

తాజా గణాంకాల ప్రకారం,

- భారత్ – 150 మిలియన్ టన్నులు

- చైనా – 145 మిలియన్ టన్నులు

- బంగ్లాదేశ్ – 36.6 మిలియన్ టన్నులు

- ఇండోనేషియా – 34.1 మిలియన్ టన్నులు

వ్యవసాయ రంగంలో తీసుకున్న సంస్కరణలు, ఆధునిక సాగు పద్ధతులు, మెరుగైన నీటిపారుదల సదుపాయాలు, రైతులకు అందించిన ప్రభుత్వ సహకారం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని నిపుణులు పేర్కొంటున్నారు.

బియ్యం ఉత్పత్తిలో భారత్ ప్రపంచ అగ్రస్థానానికి చేరడం ద్వారా దేశ ఆహార భద్రత మరింత బలపడటమే కాకుండా, అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్లో భారత స్థానం మరింత పటిష్టమయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో భారత రైతుల కృషి, వ్యవసాయ రంగ సామర్థ్యం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పబడిందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Next Story