త‌గ్గేదేలే.. 18వేల‌కు పైనే కొన‌సాగుతున్న కేసులు

India 18257 Reports new covid-19 infections.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 4:30 AM GMT
త‌గ్గేదేలే.. 18వేల‌కు పైనే కొన‌సాగుతున్న కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,32,777 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 18,257పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 42 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,428 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 14,553 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,29,68,533కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.50 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.22 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 198.76 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story