పంజాబ్‌ సీఎం ముఖ్య కార్యదర్శిగా.. తెలంగాణ వాసి వేణుప్రసాద్‌

IAS officer A Venu Prasad appointed as additional chief secretary to Punjab CM. పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్‌కు అదనపు ప్రధాన కార్యదర్శిగా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి

By అంజి  Published on  13 March 2022 4:38 AM GMT
పంజాబ్‌ సీఎం ముఖ్య కార్యదర్శిగా.. తెలంగాణ వాసి వేణుప్రసాద్‌

పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్‌కు అదనపు ప్రధాన కార్యదర్శిగా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు ప్రసాద్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి వేణు ప్రసాద్ తెలంగాణ వాసి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెకు చెందిన వేణు ప్రసాద్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శిగా, పంజాబ్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఫైనాన్షియల్ కమీషన్ టాక్సేషన్‌గా కూడా ఆయన కొనసాగుతారు. ముఖ్యమంత్రిగా నియమితులైన మాన్ శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి అనిరుధ్ తివారీ, డీజీపీ వీకే భవ్రాతో సమావేశమయ్యారు.

1995-బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి హుస్సన్ లాల్, పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ప్రధాన కార్యదర్శి.. కాగా ఆయన పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేయబడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ శుక్రవారం గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా సమర్పించారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 92 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్‌ ఇంటిదారి పట్టింది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న నవన్‌షహర్ జిల్లాలోని లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story