మణిపూర్‌ ఘటన: నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌.. హింస, అల్లర్లతో అట్టుడుకుతోంది. రెండు జాతుల మధ్య చెలరేగిన హింస.. గత రెండ నెలలుగా కొనసాగుతోంది.

By అంజి  Published on  21 July 2023 6:11 AM GMT
Manipur women, Manipur Violence , House fire, National news

మణిపూర్‌ ఘటన: నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌.. హింస, అల్లర్లతో అట్టుడుకుతోంది. రెండు జాతుల మధ్య చెలరేగిన హింస.. గత రెండ నెలలుగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా కుకీ జాతికి చెందిన ఇద్దరు మహిళలపై మైతీ గుంపు పాశవికంగా దాడి చేసిన వీడియోతో గురువారం యావత్ దేశం ఆశ్చర్యపోయింది. ఇంటర్నెట్ నిషేధం ఎత్తివేయబడిన తర్వాత వీడియో వైరల్ అయింది. ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేశారు. మే 4 నాటి వీడియో రెండు నెలలుగా కొనసాగుతున్న హింసపై చర్చకు దారితీసింది. కనీసం 130 మంది మరణాలకు, 60,000 మంది నిరాశ్రయులకు దారితీసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుతుకున్నాయి.

ఈ వీడియోను గమనించిన మణిపూర్ పోలీసులు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులపై తౌబాల్ జిల్లాలో కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇంతటి దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. గురువారం, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడుతూ, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, వీలైతే ఉరిశిక్ష విధించాలని కోరుతామని చెప్పారు.అరెస్టయిన కొన్ని గంటల తర్వాత, మణిపూర్ లైంగిక వేధింపుల వీడియో కేసులో ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటికి గురువారం అతని గ్రామంలోని కొంతమంది మహిళలు నిప్పు పెట్టారు.

మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలో మే 4న కుకీ-జోమి కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టయిన నలుగురిలో పేచీ అవాంగ్ లీకై గ్రామానికి చెందిన 32 ఏళ్ల హెరోదాస్ ప్రధాన నిందితుడు. హెరోదాస్ అరెస్టు గురించి తెలుసుకున్న పెట్చి గ్రామంలోని మహిళలు తమలో తాము కొద్దిసేపు చర్చించుకున్న తర్వాత నిందితుల ఇంటికి చేరుకున్నారు. మహిళల గుంపు నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించింది. కాగా మే 3న మణిపూర్‌లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 150 మందికి పైగా మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాలలో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించబడింది. రాష్ట్ర జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం మంది ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు. ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

Next Story