నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.

By Kalasani Durgapraveen
Published on : 13 Dec 2024 11:45 AM IST

నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపటి వరకు ప్రత్యేక చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించవచ్చు. అదే సమయంలో వయనాడ్ నుండి కొత్తగా ఎన్నికైన ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభలో తన మొదటి ప్రసంగాన్ని విపక్షాల నుండి బదులివ్వ‌నున్నారు.

మరోవైపు సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో దుమారం రేగింది. తనపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ జగదీప్ ధంఖర్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. నేను రైతు కుమారుడిని, తలవంచబోనని అన్నారు. ధన్‌ఖర్‌ ప్రకటన అనంతరం ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. నువ్వు రైతు కొడుకువైతే.. నేను కూలీ కొడుకును.. పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం అందరికీ రావాలన్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపటి వరకు రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభిస్తారు. సమాధానం ఇస్తూ ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభలో తన తొలి ప్రసంగం చేయవచ్చు.

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు ప్రతిపక్షాలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్ విరుచుకుపడ్డారు.

Next Story