పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

Vivad Se Vishwas scheme time extended. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  25 April 2021 12:04 PM GMT
tax payment

పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రస్తుతం పరిస్తితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు . కరోనా సెకండ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివాద్ సే విశ్వాస్ స్మీమ్ జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజన పొందవచ్చు. అలాగే సాధారణంగా ఈ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. ట్యాక్స్‌పేయర్లు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లు నుంచి గడవు పొడిగించాలని తమకు వినతులు వచ్చినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు.


Next Story