పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రస్తుతం పరిస్తితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు . కరోనా సెకండ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివాద్ సే విశ్వాస్ స్మీమ్ జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజన పొందవచ్చు. అలాగే సాధారణంగా ఈ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. ట్యాక్స్పేయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు నుంచి గడవు పొడిగించాలని తమకు వినతులు వచ్చినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ట్యాక్స్ పేయర్స్కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు.