చైనా యాప్లపై నిషేధం.. మరోసారి పొడిగించిన కేంద్రం
Government to continue the ban on Chinese apps including Tiktok.దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రత ప్రయోజనాల దృష్ట్యా ,చైనా యాప్లపై నిషేధం పొడిగించిన కేంద్రం.
By తోట వంశీ కుమార్ Published on
24 Jan 2021 7:21 AM GMT

దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రత, ప్రయోజనాల దృష్ట్యా గతేడాది జూన్లో టిక్టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్లను, సెప్టెంబర్లో పబ్జీతో పాటు మరో 118 యాప్లను నిషేదిస్తూ.. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ నిషేదాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు టిక్టాక్తో పాటు నిషేధం విధించిన అన్ని కంపెనీలకు, యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
తమపై నిషేధం ఎత్తివేయాలని పలు కంపెనీలు కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ సమాచారం ఇచ్చింది. కాగా.. దీనిపై టిక్టాక్ స్పందించింది. భారత చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల గోప్యతే తమ తొలి ప్రాధాన్యమని టిక్టాక్ పేర్కొంది. భద్రత విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.
Next Story