కరోనాతో మాజీ సీఎం కన్నుమూత
Former Rajasthan chief minister Jagannath Pahadia passed away. తాజాగా ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 20 May 2021 2:52 AM GMT
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడి మరణించగా.. తాజాగా ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పని చేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్గానూ సేవలందించారు.
प्रदेश के पूर्व मुख्यमंत्री श्री जगन्नाथ पहाड़िया जी के निधन की खबर बेहद दुखद है। श्री पहाड़िया ने मुख्यमंत्री के रूप में, राज्यपाल के रूप में, केंद्रीय मंत्री के रूप में लम्बे समय तक देश की सेवा की, वे देश के वरिष्ठ नेताओं में से थे।
— Ashok Gehlot (@ashokgehlot51) May 19, 2021
జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాపై చాలా అభిమానం ఉందని.. పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని ట్వీట్ చేశారు. పహాడియా మృతికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై సంతాపం తెలుపనుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియలు జరుగనున్నాయి.