ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..బెంగాల్‌లో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది

By -  Knakam Karthik
Published on : 18 March 2026 3:50 PM IST

National News, Bengal, Election Commission, 13 IAS Officers, Transfers

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..బెంగాల్‌లో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది అధికారులను బదిలీ చేస్తూ, వారిని వివిధ జిల్లాలకు మేజిస్ట్రేట్లు (DM) మరియు జిల్లా ఎన్నికల అధికారులుగా (DEO) నియమించింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యతలను వీరికి అప్పగిస్తూ, తక్షణమే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియమితులైన ముఖ్య అధికారులు వీరే:

జితిన్ యాదవ్: కూచ్ బెహార్

సందీప్ ఘోష్: జల్‌పాయిగురి

వివేక్ కుమార్: ఉత్తర దినాజ్‌పూర్

రాజన్‌వీర్ సింగ్ కపూర్: మాల్దా

ఆర్. అర్జున్: ముర్షిదాబాద్

శ్రీకాంత్ పల్లి: నదియా

శ్వేతా అగర్వాల్: పుర్బా బర్ధమాన్

శిల్పా గోరిసారియా: నార్త్ 24 పరగణాలు

అభిషేక్ కుమార్ తివారీ: సౌత్ 24 పరగణాలు

హరిశంకర్ పనికర్: డార్జిలింగ్

టి. బాలసుబ్రమణియన్: అలీపుర్‌దూర్

స్మితా పాండే: కోల్‌కతా మున్సిపల్ కమిషనర్ & కోల్‌కతా నార్త్ DEO

రణధీర్ కుమార్: కోల్‌కతా సౌత్ DEO

ఈ అధికారులందరూ జిల్లా స్థాయిలో ఎన్నికల సన్నద్ధతను, నిర్వహణను పర్యవేక్షిస్తూ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారు. బదిలీ అయిన అధికారులు తమ బాధ్యతలు చేపట్టినట్లుగా నివేదికను మార్చి 19 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే, బదిలీకి గురైన పాత అధికారులను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించకూడదని ప్రభుత్వంపై ఆంక్షలు విధించింది.

Next Story