షారుఖ్ ఖాన్ బీజేపీలో చేరితే.. డ్రగ్స్ కాస్తా చక్కెర అవుతుంది: మహారాష్ట్ర మినిస్టర్

Drugs will become sugar powder if Shah Rukh joins BJP. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని.. జైలులో ఉన్

By M.S.R  Published on  24 Oct 2021 9:55 AM GMT
షారుఖ్ ఖాన్ బీజేపీలో చేరితే.. డ్రగ్స్ కాస్తా చక్కెర అవుతుంది: మహారాష్ట్ర మినిస్టర్

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని.. జైలులో ఉన్న సంగతి తెలిసిందే..! ఆర్యన్ తో సంబంధాలు ఉన్న పలువురు స్టార్ కిడ్స్ ను విచారిస్తూ ఉంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అయితే కొందరు నాయకులు ఈ ఘటనను రాజకీయంతో ముడిపెడుతూ ఉండడమే కాకుండా.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నాడు ఆయన మాట్లాడుతూ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ దొరకడంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో అరెస్టయిన నిందితులలో సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండగా.. షారుఖ్ ఖాన్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ పౌడర్ అవుతుంది అని అన్నారు.

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసును విచారించడానికి బదులుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే సెంట్రల్ ఏజెన్సీ షారూఖ్‌పై దాడి చేసిందని ఆయన ఆరోపించారు. షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరితే డ్రగ్స్ షుగర్ పౌడర్ అవుతాయని ఈ ఎన్సీపీ సీనియర్ నేత చమత్కరించారు. ఎన్‌సిపి కార్యక్రమంలో మాట్లాడిన ఛగన్ భుజ్బల్ ఓబిసి కోటాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, అయితే బీజేపీ అడ్డుకుంటూ దానిని కోర్టులో సవాలు చేసిందని అన్నారు.


Next Story