రేపే రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం

Draupadi murmu to take oath as 15th president of india tomorrow. రేపు (జూలై 2న) దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

By అంజి  Published on  24 July 2022 11:17 AM GMT
రేపే రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం

రేపు (జూలై 2న) దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యున్నత రాజ్యంగ పదవిని చేపడుతున్న తొలి గిరిజన మహిళగా 64 ఏళ్ల ముర్ము రికార్డులకెక్కారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దౌత్య మిషన్ల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, ప్రధాన సైనిక అధికారులు హాజరుకానున్నారు.

రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఉత్సవ ఊరేగింపులో సెంట్రల్ హాల్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ముర్ము రాష్టపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రసంగిస్తారు. వేడుక ముగిశాక.. రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ ఆమెకు ఇంటర్-సర్వీసెస్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. అక్కడ పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి మర్యాదలు అందజేయబడతాయి.

గురువారం ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధ్యక్ష అభ్యర్థి ముర్ము దేశ 15వ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు.

రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం నేటితో ముగియనుంది.

జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేసిన ముర్ము, 2015 నుండి 2021 వరకు ఆ పదవిలో పనిచేశారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన రెండవ మహిళ ముర్ము. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్‌భంజ్ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో ముర్ము జన్మించారు. ముర్ము అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన చదువును పూర్తి చేసుకున్నారు. ఆమె శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్, రాయంగ్‌పూర్‌లో బోధించారు.

ద్రౌపది ముర్ము 6,76,803 విలువతో 2,824 ఓట్లను పొందగా, ఆమె ప్రత్యర్థి యశ్వంత్ సిన్హా 3,80,177 విలువతో 1,877 ఓట్లు సాధించారు. జూలై 18న జరిగిన పోలింగ్‌లో మొత్తం 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు.

Next Story