ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్‌కి దారి మళ్లింపు

శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు..

By -  అంజి
Published on : 10 Oct 2025 10:58 AM IST

Delhi,Air India flight, Dubai, technical issue

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్‌కి దారి మళ్లింపు

శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు మళ్లించబడిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. "అక్టోబర్ 9న వియన్నా నుండి న్యూఢిల్లీకి నడుస్తున్న AI-154 విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్‌కు మళ్లించబడింది. విమానం దుబాయ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అవసరమైన తనిఖీలు జరిగాయి. ఆలస్యం గురించి అందరూ ప్రయాణీకులకు తెలియజేయబడింది.రిఫ్రెష్‌మెంట్లు అందించబడ్డాయి. విమానం 08:45 గంటలకు ISTకి బయలుదేరింది" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్‌ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తుండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

Next Story