చిరుతపులి పిల్లకి పాలు పట్టిన సీఎం యోగి

CM Yogi gave milk to leopard cubs at Gorakhpur Zoo. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి బుధవారం.. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని అష్ఫాఖుల్లా

By అంజి  Published on  6 Oct 2022 4:31 AM GMT
చిరుతపులి పిల్లకి పాలు పట్టిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి బుధవారం.. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని అష్ఫాఖుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న చిరుతపులి పిల్లకు పాల సీసాతో పాలు పట్టారు. ఆయన చుట్టూ వెటర్నరీ డాక్టర్‌లు ఉండగా.. పాల సీసాతో పాలు పట్టారు. చిరుత పిల్ల తొలుత పాలు తాగేందుకు తడబడింది. చేతులకు రక్షణ కోసం రబ్బరు గ్లోవ్స్ ధరించిన యోగి ఆ తర్వాత దానిని తన ఒళ్లోకి తీసుకుని మళ్లీ పాలు తాగించేందుకు ప్రయత్నించారు. ఈసారి అది పాలను ఆగకుండా తాగేసింది.

ఈ సందర్భంగా అక్కున్న రెండు చిరుత పులులకు సీఎం యోగీ.. చండీ, భవానీ అని నామకరణం చేశారు. రెండున్నర నెలల క్రితం గోరఖ్‌పూర్ జంతుప్రదర్శనశాలకు తీసుకొచ్చిన తెల్లపులి గీతను కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రధాన ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు. సభను ఉద్దేశించి సీఎం యోగి వన్యప్రాణుల రక్షణపై ఉద్ఘాటించారు. అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణులకు సరైన సంరక్షణ, చికిత్స అందించడానికి వెటర్నరీ డాక్టర్ల ప్రత్యేక కేడర్ అవసరమని ఆయన నొక్కి చెప్పారు. జిల్లా వెటర్నరీ ఆసుపత్రుల్లో (వన్యప్రాణుల సంరక్షణ కూడా తీసుకునేవారు) నియమించిన వెటర్నరీ వైద్యులకు అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని కోసం ముసాయిదా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాన్పూర్‌లో నమామి గంగే ప్రాజెక్టు స్థిరమైన ఫలితాలను సాధించిందని, క్లీనర్ గంగ కారణంగా కాన్పూర్‌లో జలచరాలు పునరుద్ధరించబడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్‌లో డాల్ఫిన్‌లను చూశానని, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎత్తిచూపిన ముఖ్యమంత్రి, రాణిపూర్‌లో పులుల సంరక్షణ కేంద్రం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అంతరించిపోతున్న పక్షుల కోసం ప్రభుత్వం రెస్క్యూ సెంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు.


Next Story