వైద్యులపై దాడులు.. 6 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయాలని కేంద్రం ఆదేశం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై వివాదం తీవ్రమవుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది.

By అంజి
Published on : 16 Aug 2024 5:45 PM IST

Central Govt, FIR, violence against health workers

వైద్యులపై దాడులు.. 6 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయాలని కేంద్రం ఆదేశం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై వివాదం తీవ్రమవుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో ఇటీవల వైద్య సిబ్బందిపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం వైద్య సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడి చేస్తే, లేదా హింసాత్మక ఘటన జరిగితే ఇన్‌స్టిట్యూషన్‌ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాలని ఆదేశించింది. ఘటన జరిగిన 6 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయాలని లేదంటే సంస్థ హెడ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

"డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తపై ఏదైనా హింస జరిగినప్పుడు, సంఘటన జరిగిన తర్వాత ఆరు గంటలలోపు సంస్థ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. లేదంటే ఇన్‌స్టిట్యూషన్ హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) డాక్టర్ అతుల్ గోయెల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హెల్త్‌కేర్ వర్కర్ల పట్ల సంస్థాగత నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మృతదేహం లభ్యమైన 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం-హత్యలో న్యాయం కోసం పిలుపునిస్తూ భారతదేశం అంతటా వైద్యుల సంఘాలు విస్తృత నిరసనల మధ్య ఈ ఉత్తర్వు వచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని సేవలను రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు భారీ నిరసనలు చేపట్టింది. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

Next Story